Ad Code

బస్సు లోయలో పడి ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి


మ్మూకశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలో శుక్రవారంనాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్వామా నుంచి బుద్గాం వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ కింద నున్న లోయలోకి జారిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) జవాన్లు మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu