Ad Code

నవంబర్ 18 లోపు షేక్ హసీనాను అరెస్ట్ చేయండి : ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్


షేక్ హసీనా పై ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 18 లోపుగా ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఆదేశించింది. హసీనాతో పాటు మరో 45 మందిపై కూడా ఈ వారెంట్ జారీ అయింది. వీరంతా హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ నాయకులు. రిజర్వేషన్లపై విద్యార్ధుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. బంగ్లాదేశ్ నుంచి ఆమె నేరుగా దిల్లీకి వచ్చారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్ దర్యాప్తు ప్రారంభించింది. హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించాలని ప్రాసిక్యూషన్ ట్రైబ్యునల్ లో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ మహమ్మద్ గోలం మోర్తుజా మజుందార్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజులు ఇస్లాం చెప్పారు. వీరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ ట్రిబ్యునల్ లో రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మహ్మద్ గోలం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu