Ad Code

ముగిసిన తొలి రోజు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష !


తెలంగాణలో తొలి రోజు నిర్వహించిన గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్ష ముగిసింది. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వీరిలో అత్యధికులు ఇవాళ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. పరీక్ష గది, చీఫ్‌ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,896 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 87.23% హాజరైనట్టు ఆర్డీవో జైపాల్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu