Ad Code

26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం !


ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు తెలిపారు.  ఇందులో పెద్దగా మార్పులేవీ లేవన్న ఆయన.. ఇదివరకటి లాగానే రూ.100 కట్టి, సభ్యత్వం తీసుకోవాలి అనుకునేవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. అలా కాకుండా రూ.1 లక్ష కట్టిన వారికి మాత్రం పార్టీలో శాశ్వత సభ్యత్వం ఉంటుందని తెలిపారు. అంతేకాదు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా  కల్పిస్తామని తెలిపారు. ఒకవేళ కార్యకర్తలు చనిపోతే, ఖర్చుల కోసం అదనంగా రూ.10వేలు ఇస్తామన్నారు. ఈమధ్య తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించేందుకు కూడా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలంగా లేదని తెలిసే, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయ్యకుండా చంద్రబాబు చివరి నిమిషంలో తప్పించారు. ఈ నిర్ణయంపై అప్పట్లో టీ-టీడీపీ నేతలు కొందరు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఐతే.. ఏపీలో అధికారంలోకి రావడంతో.. మళ్లీ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చెయ్యవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఓవైపు నుంచి నేతల్ని ఆకర్షించే పని కూడా జరుగుతోంది.


Post a Comment

0 Comments

Close Menu