Ad Code

40 బంతుల్లో సెంచరీ చేసిన సంజు శాంసన్ !


హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో సంజు శాంసన్ బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. వికెట్ పడినా భారత్ జోరు ఆగలేదు. ఓపెనర్ సంజుతో పాటు కెప్టెన్ సూర్యలు విజృంభించారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. శాంసన్, సూర్య కుమార్ యాదవ్ బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. సంజు శాంసన్ బంగ్లా బౌలర్లను చితక్కొడుతూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ 10 ఓవర్ లో రిషద్ బౌలింగ్ లో సంజు వరుసగా 5 సిక్సర్లు బాదడం మ్యాచ్ కు హైలెట్ గా మారింది. మరో ఎండ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెలరేగడంతో టీమిండియా స్కోరుబోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. చివరికి సంజు శాంసన్ ను ముస్తాఫిజూర్ రెహ్మాన్ అవుట్ చేయడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. సంజు శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 111 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Post a Comment

0 Comments

Close Menu