Ad Code

టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ !


భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సచిన్‌ (15,921), రాహుల్‌ ద్రవిడ్‌ (13, 265), సునీల్‌ గావస్కర్‌ (10, 122) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్‌గా విరాట్‌ నిలిచాడు. 197 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకుని దూకుడు ప్రదర్శించాడు. 

Post a Comment

0 Comments

Close Menu