Ad Code

పాట్నా నుంచి బెంగళూరుకు పులి, మొసళ్లను తరలిస్తున్న వాహనం బోల్తా !


బీహార్ రాజధాని పాట్నాలోని సంజయ్గాంధీ జాతీయ పార్క్ నుంచి బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ జూపార్క్ కు రెండు వాహనాల్లో అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వాహనాల్లో ఒకటి తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామం వద్ద  అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలోని 8 మొసళ్లలో రెండు బయటపడి తప్పించుకునే ప్రయత్నం చేశాయి. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని మొసళ్లను బంధించారు. మరో వాహనాన్ని సిద్ధం చేసి బెంగళూరు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu