Ad Code

పట్టాలు తప్పిన అగర్తలా- లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ !


స్సాంలోని దిమా హసావో జిల్లా దిబలోంగ్‌ స్టేషన్‌ వద్ద లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబయికి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం 3.55 గంటలకు జరిగిన ఈ రైలు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పవర్‌ కార్‌, ఇంజిన్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే.. సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu