Ad Code

నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు !


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 26న విజయవాడ - పూణే, అక్టోబర్ 27న విశాఖ - ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే దుబాయ్, సింగపూర్ కి సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం షార్జాకి సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu