Ad Code

ల్యాండ్ జాబ్స్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వికి బెయిల్ మంజూరు !


ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ యాదవ్, తేజస్వి, తేజ్ ప్రతాప్ తో పాటు మొత్తం తొమ్మిది మంది నిందితులకు రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు వారిని అరెస్టు చేయకుండా చార్జిషీట్ చేసినట్లు తెలిపింది. ఒక్కో నిందితుడికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరూ తమ పాస్‌పోర్టులను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే దేశం విడిచివెళ్లద్దని సూచించింది. పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసిన తర్వాత బెయిల్ బాండ్ చెల్లించడానికి లాలూ యాదవ్, తేజస్వి, తేజ్ ప్రతాప్ వచ్చారు. ఈ విషయంపై మాట్లాడిన తేజస్వి యాదవ్ పలువురు వ్యక్తులు తమపై కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పలు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ కేసు విషయంలో మా ప్రమేయం లేదని, తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Post a Comment

0 Comments

Close Menu