Ad Code

పాకిస్తాన్ ని ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఇంగ్లండ్ !

                                      

పాకిస్తాన్ లోని ముల్తాన్ వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్ లో పాక్ 556 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 823/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చి 267 పరుగుల ఆధిక్యం పొందింది.కనీసం పోరాటం చేయకుండానే 220 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 152/6తో చివరి రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన పాక్ మరో 68 పరుగులే జోడించి ఆఖరి నాలుగు వికెట్లు కూడా కోల్పోయింది. అఘా సల్మాన్ (63), అమీర్ జమాల్ (55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. మూడు వికెట్లు జాక్ లీచ్ ఖాతాలో చేరగా.. అబ్రార్ అహ్మద్ గాయం కారణంగా బ్యాటింగ్ దిగకపోవడంతో పాక్ ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ (4/30) సత్తాచాటగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్సే చెరో వికెట్లతో సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో  ట్రిపుల్ సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Post a Comment

0 Comments

Close Menu