ఉత్తర ఇజ్రాయెల్పై లెబనాన్ 15 రాకెట్లు ప్రయోగించిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కొన్ని రాకెట్లను అడ్డగించగా మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అలాగే ఆస్తి నష్టాలు కూడా పెద్దగా జరగలేదని పేర్కొంది. ఐడీఎఫ్ డ్రోన్ రాకెట్ లాంచర్లను కూల్చివేసేసింది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లాతో అనుబంధంగా పని చేస్తున్న తైబే సంస్థ కమాండర్ మహ్మద్ హుస్సేన్ రమల్ను చంపినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రమల్ ఉగ్రవాద కార్యకలాపాలను అమలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్ దళాలు గురి చేసి అతన్ని చంపినట్లు పేర్కొంది.
0 Comments