Ad Code

పావురాల సాయంతో చోరీలు !


బెంగళూరులో సరికొత్త రకమైన దొంగతనాలు బయటపడ్డాయి. దాదాపు 50 ఇళ్లను ఒక్కడే వ్యక్తి దోచుకున్నాడు. పావురాలతో ఇలా ఆ దొంగ చోరీలకు పాల్పడుతున్నాడని తెలిసి పోలీసులో అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో పావురాల ద్వారా ఆ దొంగ చేసిన దొంగతనాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇక తరచూ దొంగతనాలు చేసే ఆ దొంగ గతంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినా దొంగతనాలు మానకుండా చేస్తూనే ఉంటూ తాజాగా దొరికిపోయాడు.

Post a Comment

0 Comments

Close Menu