Ad Code

భారత్ - చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి !


భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది. దీనిపై ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌ను పునరుద్ధరించాలని ఇండియా-చైనా నిర్ణయించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఫలితంగా ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక అవగాహన కుదిరిందని తెలిపారు. బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రష్యాలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి మోదీ వెళ్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా ప్రధాని జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సమావేశమవుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu