Ad Code

వృద్ధ దంపతుల దారుణ హత్య !


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోకందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. నాగుర్ కర్నూలు జిల్లా ముష్టి పెళ్లికి చెందిన ఉషయ్య (55), శాంతమ్మ (50) అనే దంపతులు కొత్తగూడెం గ్రామం శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కందుకూరు పోలీసులు క్లూస్ టీమ్స్, డాగ్స్ గార్డ్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. వృద్ధ దంపతులను ఎవరు చంపారు? ఎందుకు చంపారు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu